పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ
Published: Saturday May 21, 2022
ఇబ్రహీంపట్నం, మే 20 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్షకొండ జిల్లా పరిషత్ పాఠశాలలో, సోమవారం నుండి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థిని విద్యార్థులుకు ముప్పై మూడు మందికి భారతీయ జనతా పార్టీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు పూదరి నిషాంత్, కార్తికేయ, పరీక్ష ప్యాడ్, జామెట్రీ, బాక్స్, పెన్స్, అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోజకులై తాను చదువుకున్న పాటశాలకు తిరిగి సహాయ పడడం ద్వారా వారు దేశ సేవ చేసిన వారు అవుతారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పొనుకంటి చిన్న వెంకట్, ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, నాయకులు దొంతుల తుక్కారం, ఇబ్రహీంపట్నం మండల బీజేపీ నాయకులు, జలంధర్,శ్రీనివాస్, హిందూ వాహిని అధ్యక్షుడు శంకర్ ,విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: