ఎమ్మెల్యేను కలిసిన నేతలు.

Published: Friday October 07, 2022

చేవెళ్ల, అక్టోబర్ 06:(ప్రజాపాలన)


చేవెళ్ల మండల తెరాస నాయకులు ఎమ్మెల్యే కాలే యాదయ్య ను చించల్ పేట్ లోని ఆయన నివాసం గురువారం లో కలిశారు. ఈ సందర్భంగా జమ్మిపెట్టి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించినందుకు మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. విజయదశమి సందర్భంగా చేవెళ్ల శాసనసభ్యులను కలిసిన వారిలో చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నే శివప్రసాద్ తో పాటు ఊరెళ్ల సర్పంచ్ మహమ్మద్ జహంగీర్, ఉపసర్పంచ్ సున్గంటి విఠలయ్య, నాయకులు మిట్ట రంగారెడ్డి, నర్సింలు, కావలి భాషయ్య, తదితరులున్నారు.