వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి భూమి పూజ

Published: Saturday October 02, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యక్షులు ఎలిమినేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విసునూరు దేశముఖ్ జమీందారులను, నైజాం రజాకార్లను గడగడలాడించిన వీరవనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,అనగారిన జాతులకు లక్షల ఎకరాల భూమి పంచి,తెలంగాణ తెగువను చాటి నిరుపేద గుండెల్లో నిలిచిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల నరసింహ, మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య, స్థానిక సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు సామ రాంరెడ్డి, ఎంపీటీసీలు కుందారపు యశోద, పసల జ్యోతి, ఉప సర్పంచ్ మైసోళ్ల మత్స్యగిరి, నాయకులు పాశం సత్తిరెడ్డి, బెలిదే నాగేశ్వర్, దైవాదీనం, గరిసే రవి, లక్ష్మీ నర్స్, వెలిమినేటి రమేష్, నరసింహ, యాదగిరి, మల్లేశం వెంకటేశం, నరసింహ, జహంగీర్, శంకరయ్య, ప్రవీణ్, ప్రశాంత్, హరీష్, నరేష్, భరత్, లక్ష్మయ్య, రాములు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.