వనభోజనాలు సమైక్యతకు ఆరోగ్యానికి దోహదపడుతాయి కార్పొరేటర్ హరి శంకర్ రెడ్డి

Published: Saturday November 26, 2022
మేడిపల్లి, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రకృతి వనభోజనాలు ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచడంతోపాటు  సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరి శంకర్ రెడ్డి పేర్కొన్నారు.  డివిజన్లోని సీనియర్ సిటిజన్స్ (వాకింగ్ వారియర్స్) వారు ఏర్పాటుచేసిన ప్రకృతి వనభోజన కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి  దంపతులు పాల్గొని ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ వారియర్స్ అందరితో కలిసి వానభోజనాలు చేశారు. అనంతరం 
 వాకింగ్ వారియర్స్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి దంపతులను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వాకింగ్ వారియర్స్ అందరిని సన్మానించారు.