ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి *కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్ష

Published: Tuesday January 31, 2023
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన జంగిలి రాము ఏఐఎస్ఎఫ్ మాజీ మండల అధ్యక్షులు  రవి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఉపాధ్యక్షులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగ  రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో దేశంలో అవినీతి పేరుకుపోయిందని అదేవిధంగా తెలంగాణలో దొరల పాలన నడుస్తుందని యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వకుండా  నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఇండ్ల స్థలాలు లేక కొత్త పింఛన్లు లేక కొత్త రేషన్ కార్డులు లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అని ఈ సందర్భంగా తెలపడం జరిగింది రాబోయే కాలంలో కేంద్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గౌతమ్ ఏర్పాటు చేయగానే పేదలకు యువతకు సంబంధించి అన్ని రకాల పనులు చేస్తామని తెలపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ అని యువత ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు రమేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంకాల కర్ణాకర్ కోడూరు పాండు మహేందర్ తది తరులు పాల్గొన్నారు.