ఘనంగా భారత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు

Published: Thursday April 06, 2023

 

కోరుట్ల,ఏప్రిల్ 05 ( ప్రజాపాలన ప్రతినిధి ):

కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో భారత దేశ ఉప ప్రధాని  బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు గ్రామ పంచాయతీ అవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజా నర్సయ్య మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదట  రేషన్ బియ్యం పంపిణి కి శ్రీకారం చుట్టిన ఆద్యుడు, సంఘసంస్కర్త,  నిరుపేదలు, దళిత,  గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, వార్డ్ సభ్యులు,గ్రామ కరోబార్,వి.అర్.ఎలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.కోరుట్ల,ఏప్రిల్ 05 ( ప్రజాపాలన ప్రతినిధి ):