వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం మండలం కన్వీనర్ గా డొంకని కుమార్ గౌడ్ నియామకం

Published: Tuesday October 26, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన డొంకని కుమార్ గౌడ్ ను వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం మండలం కన్వీనర్ గా నియమించి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ కుమార్ సోమవారం నియామక పత్రాన్ని కుమార్ కు అంద జేసారు. ఈ సందర్భంగా డొంకని కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత పది ఏండ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని తెలిపారు. నాపై నమ్మకంతో మండలం కన్వీనర్ గా నియమించి నందుకు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  చేరుకునే  తరుణంలో అధిక సంఖ్యలో జనసమీకరణతో పాదయాత్ర విజయవంతం చేయటానికి కృషి చేస్తాన్నన్నారు. ఈ సందర్భంగా మండలం కన్వీనర్ గా నియమించి నందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు  ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధులు కొండా రాఘవ రెడ్డి, పిట్టా రాంరెడ్డి, భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలుగురి అమృత సాగర్, మాదగోని జంగయ్య గౌడ్  లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉడుగుల బాస్కర్ గౌడ్, ఎస్సి సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమ్ము సుధాకర్, సీనియర్ నాయకుడు పోకల్ కార్ హరి నారాయణజీ, మంచాల, యాచారం మండలం అధ్యక్షులు నేనవత్ శ్రీనివాస్ నాయక్, పంది జయరాజ్, భువనగిరి పార్లమెంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు యండి. ఖలేద్, బూర జంగయ్య గౌడ్, గోరెంకాల నందకుమార్ ముదిరాజ్ యువజన విభాగం రాష్ట కమిటీ సభ్యులు దూసరి వేణు ప్రసాద్ గౌడ్, బూడిద మహేందర్, కర్నాటి ముఖేష్ గౌడ్, వర్త్య గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.