ఘనంగా శ్రీసీతా రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

Published: Monday July 05, 2021
మేడిపల్లి, జూలై 4, (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ సాయి మారుతి నగర్లో స్థానిక కార్పొరేటర్ కాటపల్లి లత రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు, బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్, మహేందర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాటపల్లి రామచంద్రా రెడ్డి, కొత్త రవి గౌడ్, మోదుగు శేఖర్ రెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, 7వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కాటపల్లి సత్యంరెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆల్వా అమర్ లింగా రెడ్డి, 7వ డివిజన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పీసీ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాయి మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ, కాలనీ వాసులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.