వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
Published: Saturday September 03, 2022
కోరుట్ల, సెప్టెంబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణలోని కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పతకాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకుని అలాంటి నాయకున్ని కోల్పోవడం చాల బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ పట్టణ ఎస్ సి సెల్ అధ్యక్షులు పసుల కృష్ణప్రసాద్ పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మ్యాకల నర్సయ్య నాయకులు గంగధారి శ్రీనివాస్ గంగధారి సతీష్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: