లతా మంగేష్కర్ మృతి పట్ల సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సంతాపం

Published: Monday February 07, 2022
పాలేరు పిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : గానకోకిల, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు గారు తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతమన్నారు.  దాదాపు అన్ని భాషల్లో పాటలు పాడిన సుప్రసిద్ధ గాయకురాలు అని కొనియాడారు. లతా మంగేష్కర్ గాత్రం అమృతంలా ఉంటుందన్నారు. లతా మంగేష్కర్ గొంతు మూగబోవడం సంగీత ప్రియులకు తీవ్ర విషాదాన్ని కలిగించిందన్నారు. గాన జీవితంలో అనేక అవార్డులను గెలుచుకున్న ఆమె కరోనతో 26రోజులకు పైగా ఆసుపత్రిలో పోరాడి తుది శ్వాస విడువడం చాలా బాధాగా ఉందన్నారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.