పట్టణ ప్రగతి కార్యక్రమంలో వార్డులను సందర్శించిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Monday June 13, 2022

జగిత్యాల, జూన్ 12 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణములో 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14, 15, 16, 32 వార్డులలో వార్డులను సందర్శించి, పారిశుధ్య పనులనుపరిశీలించి, డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తీసి, పారిశుధ్య వాల్ పోస్టర్ ను అంటిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ  టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాలకు అత్యధిక నిధులను కేటాయిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు అని అన్నారు. అనంతరం హనుమాన్ వాడ చౌరస్తా లో స్థానిక ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసినారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లు కూతురు పద్మ (శేకర్), తోట మల్లికార్జున్, కూతురు రాజేష్,కోరే గంగమల్లు, కమిషనర్ స్వరూప రాణి, డిఈ రాజేశ్వర్, కౌన్సిలర్ లు, మున్సిపల్ సిబ్బంది,
నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.