ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తి చేయాలి

Published: Friday January 21, 2022
జన్నారం రూరల్, జనవరి 20, ప్రజాపాలన: ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల బర్తికి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని బిజేవైఎం జన్నారం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా గురువారం  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో అన్ని ఖాళీగా వున్న ఉద్యోగులను నోటిఫికేషన్లు ద్వారా పూర్తి చేయాలి, ఉద్యోగుల బర్తికి నిరుద్యోగులు కోటి ఆశలు పెట్టుకుని పోటి పరీక్షల కోసం శిక్షణ సైతం తీసుకు న్నార న్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.