కేశవరావుకు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు..
Published: Tuesday January 10, 2023
తల్లాడ, జనవరి 9 (ప్రజా పాలన న్యూస్):
*తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన చీకటి కేశవరావు దశదిన కర్మ సోమవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, మాజీ ఎంపిటిసి తాళ్ల జోసెఫ్, మారెళ్ళ మల్లికార్జునరావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో నాయకులు ఎల్లంకి వెంకటేశ్వరరావు, మల్లిడి శేషయ్య, గుమ్మా వలరాజు తదితరులు ఉన్నారు.*తల్లాడ, జనవరి 9 (ప్రజా పాలన న్యూస్):
Share this on your social network: