సర్వమత సౌభ్రాతృత్వమే ప్రభుత్వ లక్ష్యం

Published: Wednesday May 04, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 03 మే ప్రజాపాలన : సర్వమత సౌభ్రాతృత్వమే ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి సమీపంలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, మైనారిటీ సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకొని, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ప్రత్యేకమైన గంగజమునా తెహజీబ్ మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజ‌ల‌ జీవితాల్లో సుఖసంతోషాలను నింపాల‌ని అభిలషించారు. వికారాబాద్ నియోజకవర్గం మరియు జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముస్లీం సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు.