మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి --జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష
Published: Monday October 03, 2022
జగిత్యాల, అక్టోబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో మహాత్మాగాంధీ చిత్ర పటానికి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. మహాత్మా గాంధీ అందించిన అహింస ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరజ్యం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సారధ్యంలో నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇంఛార్జి ఎంపిడిఒ గంగాధర్ జిల్లా పరిషత్ సిబ్బంది మరియు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: