శ్రీ జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి
Published: Wednesday September 21, 2022
29,86,802ఆదాయం ఎర్రుపాలెం సెప్టెంబర్ 20 ప్రజా పాలన ప్రతినిధి ఎర్రుపాలెంమండలం జమలాపురంగ్రామం లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం పుణ్యక్షేత్రం నందు భక్తులు స్వామి వారికి సమర్పించిన 88 రోజుల కానుకల హుండీలను నేడు విప్పి లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు ద్వారా స్వామివారికి 29,86,802- రూపాయలు ఆదాయం వచ్చింది.సదరు హుండీలను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీ కె. జగన్మోహన్ రావు మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ ఉప్పల కృష్ణమోహన్ శర్మ ఆధ్వర్యంలో విప్పడం జరిగినది. దేవాదాయశాఖ, ఖమ్మం డివిజన్ పరిశీలకులు శ్రీమతి ఆర్. సమత పర్యవేక్షణ నిర్వహించినారు ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ సూపరింటెండెంట్ బి. శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమారి మరియు ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లాకు చెందిన సత్యసాయి సేవా సమితి సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: