నేడు మధిరలో రాష్ట్ర మంత్రి పువ్వాడ పర్యటన

Published: Monday May 09, 2022

మధిర మే 8 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ మండల పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి అజయ్ కుమార్ తెలిపిన టీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సోమవారం జరిగేమంత్రి పర్యటనలో ఎంపీ నామా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎంఎల్సి తాతా మధు, కొండబాల తదితరులు హాజరుకానున్నారు. మంత్రి పర్యటన విజయవంతం చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మధిర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తునేడు మధిరలో జరిగే మంత్రి పర్యటన వివరాలను మీడియాకి వివరించిన టిఆర్ఎస్ నాయకులు ఉదయం 10 గంటలకు ఖమ్మంపాడు గ్రామంలో నిర్మించి సొసైటీ గోడాన్ని ప్రారంభం చేస్తారు ఉదయం 10:30 గంటలకు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పౌంటెన్ ను ప్రారంభం చేస్తారు 11 గంటలకు మధిర పట్టణంలో 5.75 కోట్లతో నిర్మించనున్న ట్యాంక్ బండ నిర్మాణ పనులకు, 4.70 కోట్లతో నిర్మించబోయే సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు 11.30 గంటలకు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా స్థానిక మల్లాది వాసు నివాసంలో పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ అనంతరం అల్పాహారం చేస్తారు ఉదయం 11 గంటల 45 నిమిషాలక ఆత్కూర్ లో అబ్బూరి రామకృష్ణ సంస్మరణ సభలో పాల్గొంటారు అనంతరం రెండు సెంటర్లో ఫౌంటెన్ ప్రారంభిస్తారు. టిఆర్ఎస్ నాయకులు విలేకర్్ల సమావేశంలో వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పట్టణం అధ్యక్షులు శ్రీనివాస్ వెంకటేశ్వరరావు వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు మార్కెట్ యార్డ్ చైర్మన నాగేశ్వరరావు రైతుబంధ చైర్మెన్ వేణు వార్డు కౌన్సిలర్ అప్పారావ్ భాస్కర్ రెడ్డి నరేందర్ రెడ్డి జీవి రెడ్డి హరీష్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ లతా టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు