భగవద్గీత శ్లోకలను అసభ్యంగా చూపించిన కమిట్మెంట్ సినిమాను నిలుపు చేసి చర్యలు తీసుకోవాలి * వ

Published: Wednesday August 03, 2022

ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి.మున్సిపల్ కేంద్రంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో త్వరలో విడుదల కాబోతున్న కమిట్మెంట్ సినిమాను నిలుపుదల చేసి తగు చర్యలు తీసుకోవాలని విశ్వ విందు పరిషత్ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా విశ్వవిందు పరిషత్ నేత రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా త్వరలో విడుదల కాబోతున్న కమిట్మెంట్ సినిమా ట్రైలర్ ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.హిందువుల పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలోని పవిత్రమైన శ్లోకాలను అసభ్యకరమైన సన్నివేశాలకు వాడడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే ఆ సినిమా చిత్ర యూనిట్ పై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఎట్టి పరిస్థితులోను ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించరాదని, ఒకవేళ ప్రదర్శిస్తే యావత్ హిందూజాతి ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.అనంతరం ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులుకు ఫిర్యాదు చేశారు.