బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఖండిస్తూ శేరిలింగంపల్లిలో నిరసన
Published: Thursday May 06, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ టిఎంసి కక్షపూరిత చర్యల్లో భాగంగా బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక దాడులను, టీఎంసీ పార్టీ నాయకుల, కార్యకర్తల ఆకృత్యాలను వ్యతిరేకిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్ వద్ద డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల నుంచి 77 స్థానాలకు పార్టీ బలపడిందాని ఓర్చుకోలేక టీఎంసీ పార్టీల గుండాలు వలస వచ్చిన రోహింగాల మద్దతు తోటి ఇవాళ పశ్చిమ బెంగాల్ వృద్ధులపైన మహిళ కార్యకర్తలపైన అత్యాచారలు, బీజేపీ కార్యకర్తలపైన దాడులు జరుపుతున్నారాని అన్నారు. దీని కచ్చితంగా ఖండిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది అని అన్నారు. ఏదేమైనపటికి కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని మరింత ఉత్సహంతో పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వర ప్రసాద్, కోటేశ్వరరావు, రవి గౌడ్, శివ, నాగరాజు, రవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: