పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday July 02, 2021
మేడిపల్లి, జులై 1 (ప్రజాపాలన ప్రతినిధి) : పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా పట్టణ ప్రగతి మహా యజ్ఞంలా ముందుకు సాగాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ మున్సిపల్ కార్యాలయ గ్రౌండ్లో గురువారం ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి కార్పొరేటర్లు బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్, చేతన హరీష్, శ్రీవాణి వెంకట్రావులతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 రోజుల పాటు సాగే పట్టణ ప్రగతి మహా యజ్ఞంలా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో ముందుకు సాగనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.