వై కే ఫౌండేషన్ రాష్ట్ర పి అర్ ఓ గా ఎన్నికైన పంజాల యశ్వంత్ గౌడ్ శంకరపట్నం నవంబర్ 18 ప్రజాపాలన రి

Published: Saturday November 19, 2022

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన పంజాల యశ్వంత్ గౌడ్ ను రాష్ట్ర పిఆర్ఓగా నియమించినట్లు ఆ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రకటనలో తెలిపారు కేశవపట్నం నివాసులైన స్వాతంత్ర పోరాట యోధుడు మాజీ సర్పంచ్ పంజాల నారాయణ  మనుమడు పంజాల యశ్వంత్ గౌడ్ వై కే ఫౌండేషన్ రాష్ట్ర పి ఆర్ ఓ గా శుక్రవారం నాడు ఎన్నికయ్యారు .ఈ సందర్బంగా యాశ్వంత్ మాట్లాడుతూ వై కే ఫౌండేషన్ అంటే యువకుల సేవ సామ్రాజ్యం అలాగే రక్తదానం అంటే వై కే ఫౌండేషన్  సంస్థ నాపై నమ్మకం తో  నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు వై కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కండెం సురేష్  ఈ బాధ్యత రావడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయి కిషోర్ గౌడ్ కీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సేవ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందు ఉంటా. రక్తదానం చేస్తూ యువకులతో రక్తదానం చేపిస్తూ రక్తదానం ఉద్యమం లో చురుగ్గా పాల్గొనేలా నా వంతు గా కృషి చేస్తానని ఆయన అన్నారు.