మున్సిపాలిటీలో పలు అభివృద్ధిపై పరిశీలించినా చైర్మన్ మధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday February 22, 2023

మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్,  మరియు మినీ ట్యాంక్ బండ్  పనులను పరిశీలించిన *మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత 🎉 ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర నందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరియు మినీ ట్యాంక్ బండ్,నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇంకా పట్టణంలో పలు చోట్ల పార్కులు, సెంట్రల్ డివైడర్లు  ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు మరియు మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 30 కోట్లు నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కి,  మధిర నియోజవర్గ ఇంచార్జ్ ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఏ ఈనరేష్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .