గణేష్ పూజా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్లు కార్పొరేటర్లు నాయకులు

Published: Monday September 20, 2021
మేడిపల్లి సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15, 17 మరియు 25వ డివిజన్లోని వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద గణనాధులకు ప్రత్యేక పూజలు మరియు అన్నదానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా మేయర్  జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, మేడిపల్లి డిఐ జానీ, కార్పొరేటర్లు బండారు మంజుల రవీందర్, హరిశంకర్ రెడ్డి, యాసారం మహేశ్వరి మహేష్, అమర్ సింగ్, బండి రమ్య సతీష్ గౌడ్, భీం రెడ్డి నవీన్ రెడ్డి, పిట్టల మల్లేష్, పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర్ రెడ్డి పాల్గొని గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కాలనీ ప్రెసిడెంట్లు, కాలనీ పెద్దలు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.