ఎంఎస్ఆర్ కు ఫైర్ సిబ్బంది ఘన సన్మానం

Published: Thursday September 08, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధిజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేడేపల్లి శ్రీనివాసరావును బుధవారం మధిర ఫైర్ ఆఫీసర్ యర్రగుంట వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ కలిసి పూలమాలలు వేసి దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మేడేపల్లి శ్రీనివాసరావు విధి నిర్వహణలోనే కాకుండా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ నిస్వార్ధంగా  చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ సేవా కార్యక్రమాలను ఇలానే కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ మెన్ బి రాంబాబు, ఫైర్ మెన్లు బి నాగేశ్వరరావు, బి అనంతరామిరెడ్డి, బి భాస్కర్, ఎం సతీష్, టి మోహన్, టి నరేష్, డ్రైవర్ ఆపరేటర్లు జి శ్రీను, కె చెన్నారావు, హోమ్ గార్డ్స్ కె రాంప్రసాద్, సిహెచ్ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.