ఈటెల పై దాడిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం: మండల బిజెపి నాయకులు

Published: Thursday November 03, 2022
బోనకల్ ,నవంబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆదేశాలతో, మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్న ఈటెల రాజేందర్ పైన దాడిని ఖండిస్తూ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహన కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. మండల అధ్యక్షులు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడని ఇలా వ్యక్తిగతమైన దాడులకు దిగటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీపై జనంలో పెరుగుతున్న ఆదరణ చూసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని దాడులు చేసిన రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధి కారంలో రావటం తథ్యం అని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ని ఓడించుటకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవసరమా ఒక్క మునుగోడు సీటునే గెలవడానికి టిఆర్ఎస్ పార్టీ గుండాయిజం చేస్తుందనీ, బంగారు తెలంగాణ అంటున్నావు, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఉన్నాయి అంటున్నావు అలాంటప్పుడు ఒక మీ అభ్యర్థి ప్రచారంతోనే గెలుచుకోవాలనీ, ఆ పరిస్థితి లేదు కాబట్టే తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు తెలుసుకున్నారు.కాబట్టే ఇంత ప్రలోభాలకు గురి చేసిన గెలవడు అని ఇంటిలిజెంట్ రిపోర్ట్ తెలుసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులు పాల్పడుతున్నారని, ఎన్ని దాడులకు పాల్పడ్డా అంతిమంగా మునుగోడు ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం తథ్యం అన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కారంగుల మురళీకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి ,బిజెపి యువనేత బీపీ నాయక్, యువ మోర్చా మండల అధ్యక్షులు కలసాని పరుశురాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మరీదు పరశురాం, నాయకులు జిడుగు వెంకటేశ్వర్లు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.