అధికారులు రైతులపై కనికరం చూపించాలి గోవిందపురం ఏ గ్రామ రైతు భాగం నాగేశ్వరరావు

Published: Monday November 21, 2022
బోనకల్ ,నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో
రైతులు సాగు చేసిన వరి పంట పొట్ట దశలో కంకులు పాలు పోసుకునే దశలో ఉన్న ఈ తరుణంలో నాగార్జునసాగర్ నీళ్లు అందక పొలములు ఎండిపోతున్నాయని గోవిందపురం ఏ రైతు భాగం నాగేశ్వరరావు అధికారులను వేడుకుంటున్నారు. గత నెల నుంచి వారబంధి అని చెప్పి నీరు సక్రమంగా పంట పొలాలకు అందటం లేదని, సాగర్ లో పూర్తిస్థాయిలో నీరు ఉన్నాగాని పంట పొలాలకు నీరు అందటం లేదని డిసెంబర్ నెల వరకు నీటిని పూర్తిస్థాయిలో ఇస్తే వరి పంటను కాపాడిన వారవుతారని, అధికారులు కనీసం ఆయకట్టు రైతుల సమావేశం కూడా ఏర్పాటు చేయటం లేదని, ఏ పంటకు ఎంత నీళ్ళు ఇవ్వాలన్న విషయం మీద అధికారులు తెలియజేసుకోవాలని, కావున మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించి నీళ్లు విడుదల చేసే ఏర్పాటు చేయాలని ఒక రైతుగా అధికారులను కోరుతున్నాను. ఇకనైనా అధికారులు స్పందించి చేతికొచ్చిన పంట నష్టం వాటిల్లకుండా రైతులపై కనికరం చూపించాలని అధికారులను కోరుకుంటున్నాము.