సమాజంలో అందరు సమానులే...

Published: Tuesday June 01, 2021
బీరుపూర్, మే 31 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని రేకులపల్లె గ్రామంలో సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో అందరు సమానులే కుల మతాలకు అతీతంగా అందరు కలిసి మెలసి ఉండాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా కుల మతాలతో తిట్టిన కొట్టిన దూషించిన వెంటనే పోలీస్ స్టేషన్లో కాంప్లెట్స్ ఇస్తే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్ఐ గజేంధర్ రెవెన్యూ అధికారులు విష్ణు రాహుల్ శ్రీకాంత్ ఉప సర్పంచ్ కాసారపు రమేష్ వార్డు సభ్యులు కార్యదర్శి ఆరే రాణి కారోబర్ మ్యాడ గంగరెడ్డి విఆర్ఏలు రావుల రవీందర్ మల్లేష్ రాజేష్ రాజయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది  గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.