విద్యార్తినీలు బాగా చదువుకొని బెల్లంపల్లి పట్టణానికి పేరు తేవాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్
Published: Wednesday April 20, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి: విద్యార్థులు బాగా చదువుకొని, విద్య, ఉద్యోగ, క్రీడా రంగాల్లో, పాల్గొని, బెల్లంపల్లి పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం నాడు స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన స్పోర్ట్స్ మరియు "ఆన్వల్ " డే, ఫేర్వెల్ పార్టీ, సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్, ముందుచూపుతో ప్రతి మండల కేంద్రంలో, విద్యారంగంలో వెనుకబడి పోకుండా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఏర్పాటు చేసి విద్యాపరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటిని వినియోగించుకొని విద్యార్థులు, అభివృద్ధి చెందాలని అన్నారు. అనంతరం విద్యార్థినీలకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బి, సుదర్శన్, కౌన్సిలర్ షేక్ ఆస్మ, ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస మరియు టిఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు, కళాశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: