సినీ నటుడు", కృష్ణంరాజు మృతి తీరని లోటు" ** బిజెపి జిల్లా కార్యదర్శి కొట్నాక విజయ్ **

Published: Wednesday September 14, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 12(ప్రజాపాలన, ప్రతినిధి) : బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు, కృష్ణంరాజు మృతి పట్ల తీరని లోటు అని బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్నాక విజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో  ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ, కృష్ణంరాజు మృతి బీజేపీ పార్టీకి, సినీ పరిశ్రమకు, తీరని లోటని, పార్టీ అభివృద్ధికి ఎంతో పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన పార్టీకే కాకుండా చలన చిత్ర పరిశ్రమలో నటన ద్వారా ఎంతో పేరు సంపాదించిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వకేట్ నెంబర్ కుమ్రం లాల్ రావు, బిజెపి నాయకులు కమలాకర్, సాయినాథ్, అక్షయ్, నాని, లు పాల్గొన్నారు.