కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Tuesday June 29, 2021

బెల్లంపల్లి, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : ఎస్సీ సాధికారిత పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బెల్లంపల్లి పట్టణంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నాడు స్థానిక ఎమ్మెల్యే విడిది కార్యాలయంలోను, కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు దళిత కౌన్సిలర్లు, మాలమహానాడు నాయకులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై పాలాభిషేకం చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితుల జాతిని పారిశ్రామిక, సాంకేతిక, అన్ని రంగాల్లో ముందుకు తీసుకు పోయే విధంగా 10 లక్షల రూపాయలను ఒక్కో కుటుంబానికి అందిస్తామని చెప్పడం ఎంతో అభినందనీయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, దళిత కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాలమహానాడు నాయకులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.