ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం.

Published: Tuesday February 01, 2022

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

కొడిమ్యాల, డిసెంబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలానికి చెందిన 15 మందికి 05,79,500 రూపాయల విలువ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేయడం జరుగుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు