ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి *ప్రభుత్వ మైనింగ్ జోన్ ఏర్పాటు చేయాలని చూస్త

Published: Saturday November 26, 2022

యాచారం, మొండిగౌరెల్లి గ్రామాల సరిహద్దు లోని యాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్: 141,144 గల నెంబర్లలో మైనింగ్ జోన్ ఏర్పాటు విషయమై అధికారుల తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా గతం నుండి టిఆర్ఎస్ పార్టీ గౌరవ ఇబ్రహింపట్నం శాసనసభ్యులు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  పలు మార్లు మైనింగ్ జోన్ వస్తే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.  ఈ రోజు యాచారం మండల టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో అక్కడి గ్రామల రైతులతో, ప్రజలతో కలిసి మైనింగ్ జోన్ ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులకు, ప్రజలకు ఎల్ల వేళలా మైనింగ్ జోన్ రాకుండా అండగా ఉంటామని, మైనింగ్ జోన్ వస్తే సహించేది లేదని, కర్నాటి రమేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులతో, ప్రజలతో కలిసి మైనింగ్ జోన్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్ , మరియు ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషాగారు మరియు ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్యులు మరియు సర్పంచ్ బండిమీది కృష్ణ, నాయకులు, ఓరుగంటి యాదయ్య, సత్యపాల్, కల్లూరి శివ, కాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.