మద్యం మత్తులో విద్యుత్ శాఖ లైన్ మెన్ వీరంగం*
Published: Tuesday January 10, 2023
మంచిర్యాల , జనవరి 09, ప్రజాపాలన: మద్యం మత్తులో విద్యుత్ శాఖ లైన్ మెన్ వీరంగం
భయందోనలలో మహిళలు
వివరాల్లోకి వెళితే ఆదివారం మధ్యాహ్నం కోటపల్లి మండలం దేవులవాడ విద్యుత్ శాఖ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మత్తుగా తాగి భీమారం బస్టాండు, చర్చి ప్రాంతం వద్ద వీరంగం చేసి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు దాంతో స్థానికంగా వున్నా మహిళలు ఊపిరి పీల్చు కొన్నారని, ఈ లైన్ మెన్ గతంలో జైపూర్ లో విధులు నిర్వహించే సమయం లో మత్తుగా తాగి విధులు నిర్వహించేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి కొన్ని నెలల క్రితం కోటపల్లి మండలం రాంపూర్ బస్టాండ్ వద్ద సబ్ స్టేషన్ ల వద్ద కూడా చాలా సార్లు మత్తుగా పడుకొన్న సందర్భాలు ఉన్నాయని ఈ విధంగా మద్యం తాగి ఎల్ సి లు తీసుకొంటే కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఏంటి అని దీనితో సిబ్బంది ఒకటికి రెండు సార్లు ఎల్ సి చెక్ చేసుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని దీనిపై ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచుడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు.
Share this on your social network: