రామచంద్రాపురం గ్రామ లో సీసీ కెమెరాల పై అవగాహన సదస్సు

Published: Friday April 08, 2022
మధిర 7 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధిలోని రామచంద్రాపురం  గ్రామ పంచాయతీ  లోని సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మార్తా నరసింహ రావు ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ భవాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భవాని మాట్లాడుతూ సిసి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత వాటి ఉపయోగాలు గురించి ప్రతి గ్రామ పంచాయతీలో కెమెరా ఉండాలని ఆమె కోరి వాటిపై  ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మధిర రూరల్ పోలీస్ సిబ్బంది, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.