మిషన్ భగీరథ పైప్లైన్ పనులను తక్షణమే పూర్తి చేయాలి : మిషన్ భగీరథ అధికారులు ఆదేశించిన సీఎల్పీ
Published: Friday February 11, 2022
మధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో పలు వీధుల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేందుకు కాలవలు తీసి, రోజులు తరబడి వాటిని పూర్తి చేయకపోవడం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కోనా ధని కుమార్ మునుగోటి వెంకటేశ్వరావు స్థానిక ఎమ్మెల్యే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మల్లు భట్టి విక్రమార్క మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి మధిర మున్సిపాలిటీలో తక్షణమే మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
Share this on your social network: