పడిపూజ పాల్గొన్న వైస్ ఎంపీపీ శీలం శివపార్వతి

Published: Wednesday November 16, 2022
తల్లాడ, నవంబర్ 15 (ప్రజాపాలన న్యూస్):
  తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో కర్నాటి ప్రభాకర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారుడు రామనుజవరం మాజీ ఉపసర్పంచ్ యన్నం శ్రీనివాసరెడ్డి-శ్రీలక్ష్మి దంపతులచే అయ్యప్ప స్వామికి పలు రకాల పూలు, ఫలరసాలతో పూజలు, అభిషేకాలను కన్నుల పండుగగా మంగళవారం పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదునెట్టంబడి వెలిగించి, స్వాములకు,భవానీలకు, భక్తులకు, తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శీలం శివపార్వతి ,గణేష్ రవి, సరికొండ సాంబశివరాజు, మొగులోజు రమేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.