16వ డివిజన్లో తెరాస వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు

Published: Wednesday November 24, 2021
మేడిపల్లి, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ అధ్యక్షతన మరియు పీర్జాదిగూడ పట్టణ తెరాస నాయకులు బండి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో తెరాస డివిజన్ స్థాయి కమిటీలను ఎన్నుకున్నారు. ఈ మేరకు డివిజన్ కమిటీ అధ్యక్షులుగా పలుసమ్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కె నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్ రాజేష్, మహిళా కమిటీ అధ్యక్షురాలుగా ఎస్ చందన, ఉపాధ్యక్షురాలుగా బి కృష్ణవేణి, పి నిరుపమ ప్రధాన కార్యదర్శిరాలుగా బి కళ్యాణి, కార్యనిర్వాహణ అధ్యక్షురాలు పి వాణి, బీసీ కమిటీ అధ్యక్షులుగా సిహెచ్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా ఎం రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా పి రాజేందర్, ఎస్సీ కమిటీ అధ్యక్షులుగా ఏ బాల నరసింహ, ఉపాధ్యక్షులుగా ప్రేమ్ కుమార్, ప్రధాన  కార్యదర్శిగా పి జంగయ్య, ఎస్టీ కమిటీ అధ్యక్షులుగా భూక్యా బాలునాయక్, ఉపాధ్యక్షులుగా సునీల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా భీమ,మైనారిటీ కమిటీ అధ్యక్షులుగా అబ్దుల్ ఖలీద్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ మజీద్ ప్రధాన కార్యదర్శిగా నదీం పటేల్, యువజన సంఘం అధ్యక్షులుగా నరేష్, ఉపాధ్యక్షులుగా ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా డి.శ్రీనివాస్ మరియు విద్యార్థి సంఘం అధ్యక్షులుగా శశాంక్, ఉపాధ్యక్షులుగా సాయి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా శివలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరూ తెరాస పార్టీ సర్వతోముఖాభివృద్ధికి తమ తమ తోడ్పాటును అందించాలని కోరారు.