భగత్ సింగ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి ** ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కు వినతి **
Published: Saturday September 24, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 23 (ప్రజాపాలన, ప్రతినిధి): కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతి ని అధికారికంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పర్వతి సాయి, బాలు నాయక్, లు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పిడికిలి బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని చాటి, అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలర్పించిన "భగత్ సింగ్ కి భారతరత్న ప్రకటించాలని, అదేవిధంగా భగత్ సింగ్ జయంతి ని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, ఏఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ జిల్లా సమితి కోరుతున్నారు.
Share this on your social network: