రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందించాలి సిపిఎం మండల కమిటీ

Published: Thursday June 23, 2022
పాలేరు జూన్ 22 ప్రజాపాలన ప్రతినిధి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేలకొండపల్లి
 తాసిల్దార్ కార్యాలయం లో తాసిల్దార్ ఆధార ప్రసాద్ అని పిలిచి వినతి పత్రం అందజేయడం జరిగినది
వానాకాలం సాగు సీజన్ ప్రారంభం అయింది. విత్తనాలు, ఎరువులు అందు బాటులో ఉంచాలి. రైతులకు రుణ మాఫీ చేస్తామని రాష్ట్రం ప్రభుత్వం సకాలంలో చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, వెంటనే వాకా కాలంలో రైతు రుణాలు మాఫీ చేసి అరిగి రుణాలు మంజూరు చేయాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గొడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి  కె.వి.రెడ్డి, రచ్చ నరసింహారావు, ఇతరులు పాల్గొన్నారు