హేలీ నిస్సీ పాస్టర్ ఫెలోషిప్ మండల నూతన కమిటీ ఎన్నిక

Published: Saturday October 29, 2022

జన్నారం, అక్టోబర్ 28, ప్రజాపాలన: హెలీ నిస్సీ పాస్టర్ ఫెలోషిప్ నూతన కమిటీని శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ జన్నారం మండల నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడు పాస్టర్ ప్రేమానందం, అధ్యక్షుడు పాస్టర్ ఎం పురుషోత్తం, ఉపాధ్యక్షుడు పాస్టర్ ఆర్ ప్రకాష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పాస్టర్ కె షాలేమా రాజు, ఉప కార్యదర్శి పాస్టర్ నతనియేలు, కోశాధికారి పాస్టర్ కె ఎజ్ర, సలహాదారులు పాస్టర్ ప్రభుదాస్, ఇశ్రాయేలు,  ఏసురత్నం, ఎన్నుకోబడినారు. ఈ నూతన కమిటీకి ఎన్నికకు ముఖ్య అతిథులుగా జన్నారం సర్పంచ్ భూషనావేని గంగాధర్ గౌడ్, జన్నారం ఎంపీటీసీ ఎండీ రియాజుద్దీన్, పాస్టర్ కమలాకర్ ఎండియుపిఎఫ్ మంచిర్యాల, తదితరులు పాల్గొన్నారు.