టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలి

Published: Tuesday September 21, 2021
చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజాపాలన : టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు కార్యకర్తలను సమన్వయపరుస్తూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంయుక్తంగా అన్నారు. ఆదివారం వికారాబాద్ తేజ కన్వెన్షన్ లో తెరాస పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన మండల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. వికారాబాద్ పట్టణ అధ్యక్షునిగా దావల్ గారి ప్రభాకర్ రెడ్డి. వికారాబాద్ మండల అధ్యక్షునిగా నారెగూడెం కమాల్ రెడ్డి. మోమిన్ పేట్ మండల అధ్యక్షునిగా వెంకట్. బంట్వారం మండల అధ్యక్షునిగా రాములు యాదవ్. మర్పల్లి మండల అధ్యక్షునిగా నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి. కోట్ పల్లి మండల అధ్యక్షునిగా అనిల్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య మౌళిక వసతుల కల్పనల సంస్థ అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జహాంగిర్ పాషా, జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, ఏఎంసిలు, పిఏసిఎస్ చైర్మన్లు, వైస్ చైర్మెన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజి ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.