గ్రామాలు ,పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్ర

Published: Saturday October 29, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో 4వ రోజు అనునిత్యం ప్రజలకు కొరకు కార్యక్రమంలో భాగంగా  సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్, పుల్లయ్య క్యాంపు, పాలకేంద్రం, ఏరియాలలో... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ,విస్తృతంగా పర్యటించారు .ఉదయం 6: ల నుంచి కాలనీలలో పర్యటించి  పలు సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు. ముఖ్యంగా  త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు ,విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, ప్రజలు జెడ్పిటిసి  దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడారు సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ
పినపాక నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారని, నియోజవర్గంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను  శ్రీ రేగా కాంతారావు  కృషితో , కోట్లాది రూపాయల నిధులు మంజూరు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు., వారి సహకారంతో అనేక గ్రామాలకు సిసి రోడ్లు, బీటి రోడ్ల నిర్మాణం, కల్వర్టులు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల దగ్గరికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించామని వారి  నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అడిగి తెలుసుకున్నాము., గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు సహకారంతో పరిష్కరిస్తామని ఆమె అన్నారు., ప్రజా సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్ని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్తు కాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని ఆమె  అన్నారు. గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, లాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని  వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో సారపాక  బిఆర్ఎస్  టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, పినపాక నియోజకవర్గ  పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము లక్ష్మీ చైతన్య రెడ్డి, కార్యదర్శి భూక్య చిరంజీవి, బిఆర్ఎస్  పార్టీ నాయకులు బెజ్జంకి కనకాచారి, చుక్కపల్లి బాలాజీ, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, చట్టి ఆంజనేయులు, నక్క రమాదేవి, కర్రీ కోటేశ్వరరావు, కర్రీ నాగ, బి. సాయిబాబా, అరుణ్ ప్రసాద్, యువజన నాయకులు భూక్య కృష్ణ, ములకలపల్లి ప్రసాద్, రాయల నరేంద్ర, జీనుగు దాసు, గొడ్ల రాజు, ఏసుపాక ఈశ్వర, సోను, చెలికాని శివరామకృష్ణ, చింతా పృద్వి, భూక్య బాలరాజు, భూక్య రవి, ప్రేమ్, రాజేష్, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.