మర్రి నిరంజన్ రెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

Published: Friday February 25, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 24 ప్రజాపాలన ప్రతినిది : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం రంగాపుర్ గ్రామములో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తునికి శ్రీను అనారోగ్యంతో బాధపడుతున్న విషయము స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రినిరంజన్ రెడ్డి 5000 రూపాయలు పంపించారు వాటిని తునికి శ్రీను గారికి ఎమ్మెన్నార్ యువసేన నాయకులు మంచాల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొర చరణ్, కోటి రాథోడ్  అందించారు, ఈ కార్యక్రమంలో ఇటికాల గోవర్ధన్ రెడ్డి గారు, కమలాకర్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు, నిరంజన్ రెడ్డి  కార్యకర్తతో మాట్లాడి ఆయనకు నేను అండగా ఉంటానని దైర్యం చెప్పారు