ఇండియా కిక్ బాక్సింగ్ లో ప్రతిభ చాటిన రాసకొండ సంజీవ్

Published: Friday November 26, 2021
బెల్లంపల్లి నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 20 తేది నుండి 24 తేదీ వరకు మిరిక్ డార్జిలింగ్ లో జరిగిన కిక్ బాక్సింగ్ ఇండియా లీక్ ప్రొ చాంపియన్ షిప్ లో మైనస్ 65 లో కిక్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్ర వెల్లి గ్రామం కి చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ పాల్గొని తన సత్తా  చాటాడని ఈ సందర్భంగా ఆయనను  వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అధ్యక్షులు మిస్టర్ సంతోష్ అగర్వాల్, మరియు వాకో ఇండియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజయ్, తెలంగాణ కిక్ బాక్సింగ్ అధ్యక్షులు సి.రామాంజనేయులు, కార్యదర్శి  మహిపాల్, మంచిర్యాల జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు. ఇక ముందు జరిగే జాతీయ అంతర్జాతీయ పోటీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.