పండగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ** మైనారిటీ పోలీస్ సిబ్బం

Published: Monday April 10, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి) : పండగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకునేలా ప్రభుత్వం తరపున పోలీసుల తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పండగలు మతసామరస్యానికి ప్రతీకలని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా గురజాడ చెప్పిన మాటలను   మతాలన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి పోతాయని గుర్తు చేశారు. రంజాన్ మాసంలో కొనసాగించిన నియమనిష్టలు నిరంతరం సాగించాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని మైనారిటీలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (అడ్మిన్) అచ్చేశ్వర్ రావు,  ఏఎస్పీ (ఎ ఆర్) భీంరావు, డిఎస్పిలు శ్రీనివాస్, కరుణాకర్, సిఐ లు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.