కనపర్తి అభిమన్యుడి కి ఘనంగా నివాళులు అర్పించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య.
Published: Tuesday July 12, 2022
హైదరాబాద్ 11 జులై ప్రజాపాలన:
కనపర్తి అభిమన్యుడి కి ఘనంగా నివాళులు అర్పించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య.
వనస్థలిపురంలోని కిన్నెరసాని గ్రాండ్ హోటల్ నందు మాల దళిత బిడ్డ, దళిత రత్న కనపర్తి అభిమన్యుడు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (రిటైర్డ్) సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ సభలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు, కడారి పెంటయ్య హాజరయ్యి కనపర్తి అభిమన్యుడు చిత్రపటానికి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అభిమన్యుడి సేవలను కొనియాడారు. కనుపర్తి అభిమన్యుడిని స్మరించుకొని చెన్నయ్య మాట్లాడుతూ, మహోన్నత వ్యక్తిత్వం కలిగి, మంచి మనసున్న మనిషిగా, అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసినాడని కొనియాడారు. మీరు, మా నుండి దూరమైనా మీ జ్ఞాపకాలు మా మనసులో పదిలంగా ఉంటాయని అన్నారు. కనపర్తి అభిమన్యుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లా సూర్య ప్రకాష్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: