తెలుగుదేశం బలపేతంకు కృషి చేస్తా
Published: Saturday April 15, 2023
జన్నారం, ఏప్రిల్ 14, ప్రజాపాలన: తెలుగుదేశం బలోపేతానికి, పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని, టీడీపీ ఖానాపూర్ నియోజక వర్గం నాయకురాలు జుగునక సునిత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికి సరైన రోడ్లు లేవని, తాగునీటి సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకుని సరైన విధంగా న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కార్యదర్శి తాళ్లపెల్లి రాజేశ్వర్, సీనియర్ నాయకులు పులిశెట్టి శ్రీనివాస్, విజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: