ప్రతి ఒక్కరు విధిగా వాక్సిన్ తీసుకోవాలి

Published: Wednesday January 12, 2022
ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి
మధిర జనవరి 11 ప్రజా పాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మెయిన్ రోడ్ లోగల మంగళవారం నాటు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ టీం లీడర్ శ్రీ కుడుముల విజయభాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయనైనది.. ఇట్టి సమావేశం ద్వారా 15 నుండి 18 సంవత్సరాలు నిండినవారు రేపు, ఎల్లుండి వాక్సిన్ తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనగా ఎంపీడబ్ల్యూఎస్, మున్సిపల్ సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ టీచర్స్, వివోఎలు కూడా రేపు, ఎల్లుండి సంబంధిత వాక్సినేషన్ కేంద్రాల నందు వాక్సిన్ తీసుకోవాలని తెలియజేసారు.. మాస్క్ ఆన్ పాలసీలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, లేనియెడల రూ.1000/- జరిమానా ఖచ్చితంగా విధించడం జరుగుతుందని తెలియజేశారు.. ఇట్టి సమావేశంలో తహసీల్దార్ రాజేష్, టౌన్ రూరల్ ఎస్ ఐ ప్రియాంక, ఎంఇఓ ప్రభాకర్, ఎంపీవో, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మెడికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.