నాగేశ్వరరావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సండ్ర..

Published: Friday September 16, 2022
తల్లాడ, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని  మిట్టపల్లి గ్రామానికి చెందిన రాయల నాగేశ్వరరావు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గురువారం దశదిన కార్యక్రమంలో పాల్గొని రాయల నాగేశ్వరావు  చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన వెంట  డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, కేతినేని చలపతి, తూము శ్రీనివాసరావు, తూము వీరభద్ర రావు, నాయుడు శ్రీనివాసరావు, మువ్వ మురళి ఉన్నారు.