ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి
Published: Tuesday December 13, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజా పాలన : ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ సమస్యలపై ప్రజల నుండి 82 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలలోని తాసిల్దార్ కార్యాలయాలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు కూడా స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని సూచించారు.
Share this on your social network: